విశాలాంధ్ర ` ధర్మవరం : వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచినా కూడా ఒక్క పరిశ్రమ కూడా తేలేకపోయారని వైసీపీ ప్రభుత్వం పై ధర్మవరం ఇంచార్జ్ తెలుగుదేశం పార్టీ పరిటాల శ్రీరామ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలోని 25వ వార్డులో ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో వారు పర్యటించారు. అనంతరం ఇంటింటా తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజా వ్యతిరేక విధానాలు అమలుపరుస్తున్న ప్రభుత్వం యొక్క వివరాలను ప్రజలకు తెలియజేశారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గతంలో నిరుద్యోగ భృతి ఇచ్చేవారమని అయితే ఈ ప్రభుత్వం నిరుద్యోగులు గురించి పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు. మాటలు కోటలు దాటుతున్నాయని… చేతలు గడప కూడా దాటలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమతం కాటమయ్య, పని కుమార్, భీమనేని ప్రసాద్ నాయుడు, చింతపులుసు పెద్దన్న, మారుతి స్వామి, కృష్ణాపురం జమీర్ అహ్మద్, రాంపురం శీన, నాగూర్ హుస్సేన్, మగ్గం సూరి, కరెంటు ఆది, క్లస్టర్ రామాంజి, మహిళా నాయకురాలు సాహెబి, బీబీ తదితరులు పాల్గొన్నారు.