విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు తమవంతు సహకారం అందిస్తామని టీడీపీ నాయకులు అన్నారు. రాప్తాడు సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ పీవై ఆంజనేయులును శుక్రవారం రాప్తాడు, బోగినేపల్లి గొందిరెడ్డిపల్లి, ఎం.చెర్లోప్లల్లి సర్పంచులు సాకే తిరుపాలు, బండి ఉజ్జినప్ప, మిడతల శీనయ్య, పసుపుల బాబయ్య, నాయకుడు గేట్ సత్తి కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు ఇచ్చి శాలువాలతో సన్మానించారు. మండల ప్రశాంతతకు పెద్దపీట వేసేలా భద్రతా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ అన్నారు.