Friday, April 26, 2024
Friday, April 26, 2024

శారీరక ఉల్లాసానికి పార్కులు ఎంతగానో ఉపయోగపడతాయి..

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
విశాలాంధ్ర -ధర్మవరం : ప్రతి మనిషి శారీరిక ఉల్లాసానికి పార్కులు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం పట్టణంలోని ఎర్రగుంట, 25 వ వార్డు పోలీస్ కాలనీలో నూతనంగా ఏర్పాటుచేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మున్సిపల్ పార్కును ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తొలుత ఎమ్మెల్యే పూజలను నిర్వహించారు. తదుపరి అక్కడ వచ్చిన పిల్లలతో కాసేపు ముచ్చటిస్తూ, కొన్ని ఆట వస్తువుల విభాగాలకు పిల్లలచేనే రిబ్బన్ కట్ చేసి ప్రారంభింప చేశారు. తదుపరి అక్కడ ఎమ్మెల్యే తో పాటు, మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల, వైస్ చైర్మన్లు పెనుజూరు నాగరాజు, భాగ్యలక్ష్మి, అవార్డు కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్, ఇతర వార్డుల కౌన్సిలర్ల చేత మొక్కలు నాటారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున మాట్లాడుతూ ఈ 25వ వార్డులో 22 సెంట్లు మున్సిపల్ రిజర్వ్ స్థలములో ఈ పార్కును ఏర్పాటు చేయడం జరిగిందని, మునిసిపల్ సాధారణ నిధులతో పాటు దాతల సహకారంతో ఈ పార్కును నిర్మించడం జరిగిందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img