Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

శివాలయంలో మంచు లింగం ప్రదర్శన

విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని పెన్నా నది ఒడ్డున వెలసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి, రాజరాజేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో మహాశివరాత్రి సందర్భంగా ఓం శాంతి బ్రహ్మకుమారి లక్ష్మి ఆధ్వర్యంలో మంచు లింగం ప్రదర్శన చేశారు. ఈ మంచు లింగాన్ని మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడిపత్రి ప్రాంతంలో పురాతన కాలం నుండి శివాలయము ఉందని. కానీ ఈ శివాలయంలో ఎన్నడూ లేని విధంగా మంచు లింగం ప్రదర్శించడంతో పట్టణ ప్రజలు, భక్తులు సంతోషంతో దర్శించుకున్నార న్నారు. ఈ మంచు లింగం ప్రదర్శించినందుకు ఓంశాంతి కమిటీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓం శాంతి భక్తులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img