డి.ఎస్.పి బి శ్రీనివాసులు వెల్లడి
విశాలాంధ్ర ^ కళ్యాణదుర్గం టౌన్.. సంకల్ప సిద్ధి మార్ట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన జిల్లా వ్యాప్తంగా ఉన్న బాధితులు కళ్యాణదుర్గం ఫిర్యాదు చేసుకోవచ్చని బి. శ్రీనివాసులు వెల్లడిరచారు. గురువారం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో డి.ఎస్.పి బి శ్రీనివాసులు విలేకరుల కు వివరాలు వెల్లడిరచారు . సంకల్ప సిద్ధి మార్ట్ స్కీం వలన బ్రహ్మసముద్రం మండలం సూగేపల్లి కి చెందిన నరేష్ 3,16000 వేల రూపాయలు పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు గోవిందరాజులు ఐదు లక్షల రూపాయలు మోసపోయినట్లు ఫిర్యాదు వచ్చిందన్నారు. వీరితోపాటు సంకల్ప సిద్ధి లో పెట్టుబడి పెట్టి మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్లో తగిన ఆధారాలతో సర్కిల్ ఇన్స్పెక్టర్ తేజోమూర్తికి ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. విచారణ చేసి తగు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని డిఎస్పి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ తేజో మూర్తి, ఎస్ఐ ఆశ బేగం పాల్గొన్నారు.