విశాలాంధ్ర, కళ్యాణదుర్గం : రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలారు. శనివారం తెల్లవారుజామున తన ఇంటి ముందర భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. స్థానిక రెవెన్యూ, పోలీస్ , మున్సిపల్ యంత్రాంగం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు పాడి పంటలు సమృద్ధిగా పండాలని మంత్రి కోరుకున్నారు. సంబరాలు అనంతరం కళ్యాణదుర్గం మండల పరిధిలోని మల్లిపల్లి లో చౌడేశ్వరి దేవి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఆమె భర్త చరణ్ రెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొని వేడుకలు జరిపారు.