ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి
విశాలాంధ్ర`ఉరవకొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు కూడా ఆర్థికాభివృద్ధి సాధించారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి అన్నారు. శనివారం ఉరవకొండ మండలం వెలిగొండ గ్రామంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకి అతీతంగా ఎలాంటి అవినీతి అక్రమాలు జరగకుండా అర్హులైన పేదలందరికీ కూడా సంక్షేమ పథకాలని అందిస్తున్నామన్నారు. ఒక్క ఆసరా పథకం వల్ల మహిళలు పెద్ద ఎత్తున లబ్ధి పొందారని తెలిపారు. ఒక్క వెలుగొండ గ్రామంలోని వివిధ సంక్షేమ పథకాలు వల్ల 6 కోట్ల రూపాయలు ప్రజలు లబ్ధి చేకూరింది అన్నారు. అర్హులైన పేదలందరికీ కూడా గృహాలు నిర్మించడంలో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందన్నారు అంతకుముందు ఆయన వెలిగొండ గ్రామంలో ఏడు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన తాగునీటి ట్యాంకులను రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వీరాంజనేయులు, వైస్ ఎంపీపీ నరసింహులు వీరితో పాటు ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు