వైసిపి నాయకులు హనుమంత్ రెడ్డి
విశాలాంధ్ర` ఉరవకొండ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలతో పేదరిక నిర్మూలన జరిగిందని వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమాన సంఘం నాయకులు ధర్మపురి హనుమంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో ఉంటూ రాష్ట్రాన్ని ప్రగతి మరియు అభివృద్ధి బాటలో నడిపించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు జగన్ అభిమానులు పాల్గొన్నారు.