Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సంక్షేమ పథకాలు అమలులో దేశానికే ఆదర్శం

మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి
విశాలాంధ్ర`ఉరవకొండ :
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని  ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి అన్నారు. గురువారం వజ్రకరూరు  మండలం పి సి ప్యాపిలి తాండ గ్రామంలో ‘‘గడప గడపకు మన ప్రభుత్వం’’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా పేద ప్రజల కోసం ఇన్ని సంక్షేమ పథకాలు లేవన్నారు. పేదల యొక్క కష్టాలను తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వారి యొక్క అభివృదే లక్ష్యంగా పనిచేస్తున్నారని కొనియాడారు అనంతరం ఆయన  ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, అమలు చేస్తున్న పథకాలను వివరించి బుక్‌లెట్‌లు పంపిణీ చేశారు.. సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ  ప్రజా ప్రతినిధులు, నాయకులు, అన్ని ప్రభుత్వ శాఖ అధికారులు  సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img