Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

సంచార జాతుల సమావేశానికి ఢిల్లీకి వెళ్లిన ఏపి సంచార జాతల నాయకులు…

విశాలాంధ్ర -గుంతకల్లు : 32 కులాల సంచార జాతుల అభివృద్ధి కోసం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సంచార జాతుల సమావేశానికి మంగళవారం ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు ఏపీ సంచారజాతుల నాయకులు ఢిల్లీ సంచార జాతుల సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ 32 కులాల సంచార జాతులను విద్యా రాజకీయ అనేక రంగాల్లో అదేవిధంగా మూడవ షెడ్యూల్లో పొందుపరిచి 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. వెనకబడిన సంచార జాతుల ప్రజలను పట్టించుకునే నాధుడులేడని అన్నారు. 76 సంవత్సరాల స్వతంత్రంలో సంచార జాతులకు ఏ మాత్రం న్యాయం జరగలేదన్నారు.ఇప్పటికైనా సంచార జాతుల అభివృద్ధికి పాటుపడాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img