Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

విశాలాంధ్ర -ధర్మవరం : కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలలో ముందంజలో ఉండడంతో ధర్మవరం కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగన్న అమిర్ భాషలు నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని ఎన్టీఆర్ కూడలి వద్ద శనివారం ఉదయం బాణాసంచా పేర్చుతూ, మిఠాయిలను పంపిణీ చేస్తూ ఘనంగా సంబరాలు జరుపు కున్నారు.ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జ్ రంగన అశ్వర్థ నారాయణ, ఐఎన్టియుసి రాష్ట్ర కార్యదర్శి..అమీర్ భాష, ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి. ఎం.
నరేంద్ర లు మాట్లాడుతూ నేటి కర్ణాటక ఎన్నికల ఫలితాలలో రాహుల్ సునామి మొదలైందని, వారి నాయకత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ సునామీలో మోడీ మానియా కొట్టుకుపోయింది అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం అన్నది ఒక సంకేతమని, దీంతో ఇకనుంచి దేశంలో జరగబోయే ఎన్నికల్లో ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఇంత స్పష్టమైన మెజారిటీ ఇచ్చి అఖండ విజయాన్ని చేకూర్చిన ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ నాయకుల శ్రేణులకు పేరుపేరునా వారు కృతజ్ఞతలు తెలిపారు.2024 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ నాయకత్వాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చైతన్య తో పాటు సురేష్, గణేష్, గిరీష్, ఇంద్ర, నాగేంద్ర, లక్ష్మీనారాయణ తో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img