విశాలాంధ్ర`ఉరవకొండ : ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల లలో సభా ప్రాంగణాన్ని నిర్మించడానికి పది లక్షల రూపాయలు విరాళం అందజేసిన దాత పి సమీర్ కుమార్ ను కళాశాలలో ఘనంగా సన్మానించారు. వారి తండ్రి పెనకలపాటీ ఆంజనేయులు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు నిర్మించిన ప్రాంగణాన్ని శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మమతా మాట్లాడుతూ సమీర్ కుమార్ కృషి పట్టుదల చూసి విద్యార్థులందరూ నేర్చుకోవాలని సూచించడం జరిగింది సమీర్ కుమార్ మాట్లాడుతూ చదివిన స్కూలుకి కాలేజీకి తమ ప్రాంతానికి మన నుంచి ఎంతో కొంత సహాయం చేయాలని విద్యార్థులకు సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో దాతలైన సమీర్ కుమార్ తో పాటు వారి బంధువులు కుటుంబ సభ్యులు మరియు కళాశాల అధ్యాపకులు పాల్గొనడం జరిగింది