కార్యదర్శి గౌస్ సాహెబ్
విశాలాంధ్ర`ఉరవకొండ : ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ 15 వ వార్డు పరిధిలో ఉన్న శివరామిరెడ్డి, చిట్టా, మరియు చర్చి కాలనీల లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీ కార్యదర్శి గౌస్ సాహెబ్ తెలిపారు. బుధవారం వార్డు సభ్యులు వసికేరి మల్లికార్జున తో కలిసి ఆయన కాలనీలో పర్యటించారు. ఈ కాలనీలో వీధి దీపాలు, దోమల నివారణకు పాగింగ్, స్ప్రే పరిసరాల పరిశుభ్రత మరియు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని వార్డు సభ్యులు కార్యదర్శి దృష్టికి తీసుకొచ్చారు స్పందించిన కార్యదర్శి కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నిటిని కూడా దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాలనీలో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి కార్యదర్శి రావడం పట్ల వార్డు సభ్యులు మల్లికార్జున కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.