Friday, April 19, 2024
Friday, April 19, 2024

సమాచార కమిషనర్‌ ఉల్చాలకు సత్కారం

విశాలాంధ్ర ` అనంతపురం వైద్యం : రెండురోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార కమిషనర్‌ ఉల్చాల హరిప్రసాద రెడ్డిని పలువురు ఆత్మీయంగా సత్కరించారు. సీనియర్‌ జర్నలిస్టుగా సుదీర్ఘకాలం పనిచేసిన ఉల్చాల సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు శుక్రవారం తిరుపతి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కమిషనర్‌ ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. దుశ్శాలువా కప్పి తిరుమల శ్రీవారి ప్రసాదం ఆయనకు అందజేశారు. జర్నలిజం, సాహిత్యం, సమాచారహక్కు చట్టం వంటి పలు ఆసక్తికర విషయాలను వారు ఈ సందర్భంగా చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక తిరుపతి జిల్లా ప్రధానకార్యదర్శి అరవ జయపాల్‌, డివిజినల్‌ పి.ఆర్‌.ఓ. విజయసింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img