విశాలాంధ్ర- జేఎన్టీయూఏ : సాంకేతిక విజ్ఞానం మానవాళి ప్రగతికి ముఖ్య భూమిక పోషించాలని జోహార్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జింక రంగా జనార్ధన్ పేర్కొన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, తిరుపతి సైన్సు , రీసెర్చ్ బోర్డ్ ఇండియా అద్వర్యంలో రెండు రోజుల పాటు డీ గ్రాంట్ పోస్టల్ ఫర్ ఉమెన్ ఇంజనీర్స్ పై అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాటాడుతూ. అధ్యాపకులు పరిశోధత్వకమైన ప్రాజెక్టులను చేపట్టి పారిశ్రామిక నవనిర్మానానికి చేయూతను ఇవ్వాలన్నారు. ఈ సదస్సులో కోఆర్డినేటర్లు డా. బి. బాలకృష్ణ న్ , డాక్టర్ ఎ. గౌరీ , డాక్టర్ భరత్ కుమార్ , డాక్టర్ డి.ఆర్. ప్రసాద్ రాజు , వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.