ఘనంగా నివాళులు అర్పించిన బహుజన సమాజ్ పార్టీ
విశాలాంధ్ర`అనంతపురం వైద్యం : మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే సామాజిక విప్లవ పితామహుడు అని సామాజిక అనంత జిల్లా ఇంచార్జ్ కాసాని నాగరాజు పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ ఆఫీస్ ప్రాంగణంలో ఉన్న విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంత నియోజకవర్గం ఇంచార్ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి కాసాని నాగరాజు మాట్లాడుతూ, బహుజన సమాజ్ పార్టీ మహనీయుల లో మహాత్మా జ్యోతిరావు పూలే మొదటి వారు అని వారి ఆశయాల కోసం నిరంతరం పనిచేసే, మహనీయుల లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తున్న ఏకైక పార్టీ అని పేర్కొన్నారు. ప్రజలందరూ దీనిని గమనించి, పార్టీని బలోపేతానికి కృషి చేయాలని అప్పుడు మాత్రమే బడుగు, బలహీన, మైనారిటీ ప్రజలందరూ నిజంగా మహాత్మా జ్యోతిరావు పూలే కి నిజమైన నివాళులు అర్పించినవారిమౌతామని పేర్కొన్నారు. బహుజనులు రాజ్యాధికారం సాధించి, బహుజనులు అందరూ సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే మహనీయుల ఆశయాలను నెరవేర్చిన వారం అవుతామన్నారు . ఈ కార్యక్రమంలో అనంత నియోజకవర్గం ఇంచార్జ్ కంచె గోపాల్, నియోజకవర్గం అధ్యక్షులు హరి ప్రసాద్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ అంకె కుళ్లాయప్ప, నియోజకవర్గ ఉపాధ్యక్షులు వై కే నాగభూషణం, కోశాధికారి నాగరత్నమ్మ, నగర అధ్యక్షులు డి. గంగాధర్, గవ్వల ఓబులేష్, హేమ సుందర్, మంజునాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.