విశాలాంధ్ర-రాప్తాడు : తనకున్న సంపాదనలో సాయం చేయడంలోనే ఆత్మసంతృప్తి ఉంటుందని కురుబ కార్పోరేషన్ రాష్ట్ర డైరెక్టర్ దండు రామాంజినేయులు అన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీహెచ్ఎస్ లో చదువుకుంటూ రాప్తాడులోని బీసీ బాలుర వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులకు బుధవారం కప్పుకునేందుకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ, వసతి గృహంలో ఉన్న విద్యార్థులు శీతాకాలంలో ఇబ్బందులు పడకుండా 80మంది విద్యార్థులకు సొంత నిధులు వెచ్చించి పంపిణీ చేశామన్నారు. విద్యార్థులు రాత్రి వేళల్లో ఇక్కడే ఉంటూ నిద్రపోతుంటారన్నారు. చలి నుంచి రక్షణ పొందేందుకు ఈ దుప్పట్లు పంపిణీ చేశామని ఆయన అన్నారు. కార్యక్రమంలో వార్డెన్ గోవిందరెడ్డి, రామాంజినేయులు కుమారులు సిద్దార్థ్, శశాంక్, పాటిల్ చంద్రశేఖర్, ఆదినారాయణ, గంజి నాగభూషణ, చిట్రా ఆది తదితరులు ఉన్నారు.