విశాలాంధ్ర` అనంతపురం వైద్యం : అనంతపురం శాంతి నగర్ కు చెందినా వెంకటేష్ (50 సంవత్సరాలు) అనే వ్యక్తి పెయింటర్ గా పని చేస్తూ బిల్డింగ్ నుండి జారిపడి గా తలకు గాయం అయి మృతి చెందగా మర్చురి లో సోమవారం ఉంచగా విషయం తెలుసుకున్న సాయి ట్రస్ట్ వారు , ఎల్.వి ప్రసాద్ ఆప్తమాలిక్ అసిస్టెంట్ శ్రీకాంత్ కుటుంబ సభ్యులను ఒప్పించి హైదరాబాద్ ఎల్వి. ప్రసాద్ ఐ హాస్పిటల్ చెందిన ఆప్తమాలిక్ అసిస్టెంట్ శ్రీకాంత్ నేత్రాలను తీసుకున్నారు. బెలుగుప్ప మండలం, యలగల వంక గ్రామం, కు చెందినా గొల్ల భీమ సేన (52 సంవత్సరాలు) రోడ్డు ప్రమాదం లో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను ఒప్పించి కేవలం ఒక్క కన్ను మాత్రమే బాగుండగా మరొక కన్ను ప్రమాదం లో కోల్పోగా ఆ ఒక్క కన్ను ను హైదరాబాద్ ఎల్వి. ప్రసాద్ ఐ హాస్పిటల్ చెందినా ఆప్తమాలిక్ అసిస్టెంట్ శ్రీకాంత్ నేత్రాలను తీసుకున్నారు.సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం, మాదన్న పల్లి గ్రామం కు చెందినా జి.అరుణ(35 సంవత్సరం) విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను ఒప్పించి హైదరాబాద్ ఎల్వి. ప్రసాద్ ఐ హాస్పిటల్ చెందినా ఆప్తమాలిక్ అసిస్టెంట్ శ్రీకాంత్ నేత్రాలను తీసుకున్నారు. నేత్రదానం చేయగోరిన వారు సాయి ట్రస్ట్ ను 8712345520, 9666756921,శ్రీకాంత్ ఎల్.వి ప్రసాద్ ఆప్తమలిక్ అసిస్టెంట్ 9398312479 సంప్రదించగలరని సాయి ట్రస్ట్ అద్యక్షుడు విజయసాయి కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం లో సాయి ట్రస్ట్ సభ్యులు నారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు.