Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సావిత్రి బాయి పూలే అడుగుజాడల్లో నడవాలి


విశాలాంధ్ర -ధర్మవరం : సావిత్రిబాయి పూలే అడుగుజాడల్లో అందరూ ఆదర్శంగా తీసుకొని ముందడుగు వేయాలని కాకతీయ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం కర్రీస్పాండెంట్ నిర్మలాదేవి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో భాగంగా భారతీయ సంఘసంస్కర్త, ఉపాధ్యాయుని, రచయిత్రి అయిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఉపాధ్యాయులు, విద్యార్థుల నడుమ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్మలాదేవితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నిర్మలాదేవి మాట్లాడుతూ సావిత్రిబాయి చేసిన కృషిని విద్యార్థులకు తెలియజేశారు. నేటి తరం విద్యార్థులకు సావిత్రిబాయి పూలే ఆదర్శాలు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సూర్యప్రకాశ్ రెడ్డి, పద్మ, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img