విశాలాంధ్ర` ఉరవకొండ: ఉరవకొండ పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్ సమీప నుంచి వీరశైవ కాలనీలోకి వెళ్లి రహదారిని సీసీ రోడ్డుగా నిర్మాణం చేపట్టే పనులు మంగళవారం ప్రారంభించారు. ఈ పనులను ఎంపీపీ చంద్రమ్మ, జడ్పిటిసి సభ్యులు పార్వతమ్మ, వైస్ ఎంపీపీ నరసింహులు పర్యవేక్షించారు రోడ్డు పనులు పూర్తిగా నాణ్యతతో నిర్మించాలని వారు తెలిపారు. ఉరవకొండ పట్టణంలో దాదాపు 5 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు నిర్మాణం చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. ఉరవకొండ పట్టణ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించిన మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు తిప్పయ్య, మాజీ ఎంపీపీ ఏసీ ఎర్రి స్వామి, రాష్ట్ర డైరెక్టర్లు గోవిందు, వెంకటేశులు కో ఆప్షన్ సభ్యులు సలీం వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు బసవరాజు మల్లికార్జున, అంజి, ఓబన్న, వార్డు సభ్యులు ప్రభాకర్ ఆ పార్టీ నాయకులు బ్యాళ్ళ ప్రసాద్, సలీం పంచాయతీరాజ్ ఇంజనీర్ మధు భూషణ్ తదితరులు పాల్గొన్నారు