విశాలాంధ్ర-గుంతకల్లు : 15 నుంచి 20 ఫిబ్రవరి 2023 పాట్నా బీహార్ లో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని శనివాలం పట్టణ కార్యలయంలో మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వలి, ఏఐఎస్ఎ రాష్ట్ర అధ్యక్షులు వేమన పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ దర్శకత్వంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న మతోన్మాద ఆశ్రిత పెట్టుబడిదారీ ఫాస్టెస్ట్ విధానాలు దేశాన్ని ఆర్థిక సంక్షోభం వైపు నెట్టేస్తున్నాయన్నారు.భవిష్యత్తు కర్యాచరణ నిర్ణయించేందుకు పార్టీ 11వ జాతీయ మాహసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు హలీ, రామ తదితరులు పాల్గొన్నారు.