పోలా ప్రభాకర్.. శ్రీ సత్య సాయి జిల్లా వైస్ చైర్మన్
విశాలాంధ్ర -ధర్మవరం : రెడ్ క్రాస్ యొక్క ఆశయ సాధనాలు మార్గదర్శనాలపై సేవా గుణాన్ని అంతటా విస్తరింప చేస్తామని రెడ్ క్రాస్ సంస్థ జీవిత కాల సభ్యులు డాక్టర్ నరసింహులు, శ్రీ సత్య సాయి జిల్లా వైస్ చైర్మన్ పోలా ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం కాలనీలో గల మధు కంటి వైద్యశాలలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డ్యూనాండ్ జన్మదినోత్సవాన్ని రెడ్ క్రాస్ దినోత్సవం గా జరుపుకుంటామని, రెడ్ క్రాస్ ను బలోపితం మున్ముందు చేయడం జరుగుతుందని తెలిపారు. యుద్ధంలో గాయపడిన సైనికులకు సేవలు అందించాలన్న నేపథ్యంలోనే స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేయాలన్న సంకల్పంతోనే రెడ్ క్రాస్ ఏర్పడిందని వారు తెలిపారు. అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ 1919 లో స్థాపించబడిందని మరి భారతదేశంలో 1920 లో కేంద్ర ప్రభుత్వం చట్టం కింద స్థాపించబడినది తెలిపారు. మానవత్వము, నిష్పక్షపాతము, తటస్థత, స్వాతంత్రము, స్వచ్ఛంద సేవ,ఐక్యత, విశ్వజనీనత అనునవి రెడ్ క్రాస్ సూత్రాల ఆధారంగా ఉన్నాయని తెలిపారు. విపత్కర పరిస్థితులలో నేటి మనిషికి రెడ్ క్రాస్ సేవా సంస్థలు స్వచ్ఛందంగా తమ విధులను నిర్వర్తిస్తారని తెలిపారు. స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ప్రధమ చికిత్సలో శిక్షణ కూడా ఇవ్వబడుతుందని తెలిపారు. సేవా భావం కలిగిన వ్యక్తుల నుండి రక్తము సేకరించి, రక్త నిధిలో భద్రపరిచి, అవసరమైన వారికి అందించి,ప్రాణాలను కాపాడటం జరుగుతుందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు బ్రెడ్, అరటి పండ్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ పద్మలత, డాక్టర్ నజీర్, రెడ్ క్రాస్ సంస్థ జీవితకాలపు సభ్యులు డాక్టర్ సత్య నిర్ధారణ కూడా పాల్గొన్నారు.