గుంతకల్లు తహశీల్దార్ బి.రాము
విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలోని డాఁబాబు రాజేంద్రప్రసాద్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గుంతకల్ తహసీల్దార్ బి.రాము పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు విద్యార్థి దశ నుండి చిన్న చిన్న ప్రయోగాలు ఆవిష్కరణలు శ్రీకారం చుట్టాలని అప్పుడే మంచి ఆలోచనలు వెలువిరుస్తాయి అన్నారు.దాని వలన సమాజము ప్రగతి వైపు అడుగులేస్తుంది అని పేర్కొన్నారు. అనంతరం వక్తృత్వ పోటీలలోని విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరిగిందన్నారు.అలాగే హరిప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో విశిష్ట సేవలందిస్తున్న కానిస్టేబుళ్లు ఎస్ ఎం డి ఇస్మాయిల్,మహబూబ్ బాషా,వీరేశ్ లకు జన విజ్ఞాన వేదిక ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జేవీవీ సేవ అవార్డ్ అందజేయడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.గంగ రాజు,జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డా. హరిప్రసాద్ యాదవ్, స్కూల్ హెడ్మాస్టర్ ఉమామహేశ్వర్, ఉపాధ్యాయులు శంకరయ్య, రామ్మోహన్, ఉదయ్ బాస్కర్ తదితరులు పాల్గొన్నారు.