Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సొసైటీ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోండి.. బిజెపి నాయకులు

విశాలాంధ్ర.. ధర్మవరం : పట్టణంలోని రేగాటిపల్లి సొసైటీ భూములు అన్యాక్రాంతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం పుట్టపర్తి లోని కలెక్టర్ బసంత్ కుమార్కు బిజెపి రూరల్ అధ్యక్షుడు అరవింద్ రెడ్డి, ఎస్సీ మోర్చా నాయకులు తుంపర్తి పరమేష్, చిలకం సూర్య నారాయణరెడ్డి, శేఖర్, పెద్దిరాజులు, మైనారిటీ నాయకుడు ఆటో రసీద్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేగాటి పల్లి లోని సొసైటీ భూములు అత్యంత విలువతో కూడుకున్నవని, ఆ భూములను అధికార పార్టీ నాయకులు సొమ్ము చేసుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు విన్నవించారు. ఆ సొసైటీ భూముల్లో పేదలకు ఇంటి పట్టాలను ఇవ్వాలని తెలిపారు. ఇంతకుమునుపే అధికార పార్టీ నాయకులు వారి పేర్ల మీద ఎకరాలకు ఎకరాలు ఆన్లైన్లో అప్లైడ్ చేయించుకున్న విషయాన్ని కూడా తెలపడం జరిగిందన్నారు. అప్పట్లోని ఆర్డిఓ, తాసిల్దార్, విఆర్వోలకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని తెలిపారు. స్పందించిన కలెక్టర్ విచారణ చేసి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img