Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

స్టాక్ పాయింట్ దగ్ధం 20 లక్షలు నష్టం…

విశాలాంధ్ర-గుంతకల్లు : స్పైకి ట్రేడర్స్ స్టాక్ పాయింట్ గోడౌన్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు ఎగసిపడి దగ్ధం వాటిల్లిన సంఘటన గుంతకల్లులో చోటుచేసుకుంది.. పట్టణ శివారులోని ఆలూరు రోడ్డు సమీపంలో ప్రశాంత్ నగర్ కాలినిలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక గోడౌన్ లో మంటలు చెలిరేగాయి గోడౌన్ కి తాళం వేసి ఉండడం వల్ల చుట్టుప్రక్కల వారు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ అదికారి లింగమయ్య తన సిబ్బందితో హుటా హూటీన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పినట్లు తెలిపారు.షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు ఏర్పడ్డాయని అందులో ఫోమ్, వుడ్, రబ్బర్, మ్యాట్, కంప్రెషర్ ఇతర సామాగ్రి ఉన్నట్లు తెలిపారు. దాదాపుగా వంద శాతం నష్టం వాటిల్లిందని 20 లక్షల రూపాయల వరకు నష్టం వాటిలిందని గోడౌన్ యజమాని వీ.జీ శ్రీనివాసులు తెలిపారు.అదే సమయంలో చుట్టుప్రక్కల ఉన్న గృహాలలో దాదాపుగా 20 ఇళ్లల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల టీవీలు, స్టెబిలైజర్లు, కూలర్స్ ,ఏసీ మిషన్లు పాడైనట్లు తెలిపారు. ఈ సర్క్యూట్ కు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు బాధ్యత వహించాలని బాదితులు డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img