Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

స్వర్ణకార కార్మికులకు ఆర్థిక సహాయం.

విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని అల్లా రఖా వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకుడు కలైగర్ మహమ్మద్ అయూబ్ మంగళవారం స్వర్ణకార కార్మికులకు ఆర్థిక సహాయం, రంజాన్ తోఫా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆధునిక యుగంలో బంగారు ఆభరణాలు చేతివృత్తిగా జీవనం కొనసాగిస్తున్న స్వర్ణకారుల కార్మికులు చేతి పని తక్కువై ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తనకు తెలిసింది. అలాగే తన చిన్నతనం నుండి స్వర్ణకార కార్మికునిగా పని చేసుకుంటూ జీవనం గడుపుతున్న చింతలప్ప కాలనీకి చెందిన ఎర్రగుడి ఇస్మాయిల్ అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని తనకు తెలియడంతో నా వంతు సహాయంగా ఎర్రగుడి ఇస్మాయిల్, బి. భాష లకు ఒక్కొక్కరికి 5వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందించాను. అలాగే రంజాన్ సందర్భంగా ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలతో రంజాన్ వేడుకలు జరుపుకోవాలని ఉద్దేశంతో నిత్యవసర సరుకులు, దుస్తులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లా రాఖా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు సయ్యద్ అయుబ్ భాష, నజీర్ భాష, ఎం.ఎస్. భాష , ఎం. మహబూబ్ బాషా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img