డాక్టర్ పి. త్రిశూల్ పాణి
విశాలాంధ్ర- ఉరవకొండ : విద్యార్థులు స్వామి వివేకానంద ను ఆదర్శంగా తీసుకొని గొప్ప వ్యక్తులుగా ఎదగాలని రామకృష్ణ సేవా సమితి బావ ప్రచార పరిషత్ రాయలసీమ కన్వీనర్ డాక్టర్ పి. త్రిశూల్ పాణి అన్నారు. గురువారం ఉరవకొండ మండలం చిన్న ముష్టురు సమీపంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్వామి వివేకానంద జయంతి, మరియు జాతీయ యువజన దినోత్సవం వారోత్సవాల కార్యక్రమాలను ఇంచార్జ్ ప్రిన్సిపల్ వై. సురేష్ బాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న త్రిశూల్ పాణి మాట్లాడుతూ విద్యార్థులు నైతిక విలువలతో ఏకాగ్రతతో పట్టుదల తో విద్యను అభ్యసిస్తే సాధించలేనిది అంటూ ఏమీ లేదని ఆయన విద్యార్థులలో ఉత్తేజాన్ని నింపే విధంగా ప్రసంగించారు. ఇన్చార్జ్ ప్రిన్సిపల్ సురేష్ బాబు మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశ ఔనత్యాన్ని ప్రపంచ దిశ దశల చాటున వ్యక్తిని కొనియాడారు వేదాంతం, ఆధ్యాత్మికత యోగా, తత్వాలను ప్రచారం చేయడంలో కీలకపాత్ర పోషించారు అన్నారు. ఆయన రచనలు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. అలాంటి వ్యక్తి యొక్క గొప్ప ఆశయాలను నైతిక విలువలను విద్యార్థులు అందరూ కూడా అలవర్చుకోవాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలు కి చెందిన సీనియర్ అధ్యాపకులు సులోచన, అలీ ఆఫ్ హుస్సేన్, చంద్రం బాబు, ధనలక్ష్మి, చంద్రమోహన్,రాజేష్ తదితరులు విద్యార్థులను ఆలోచింపచేసే విధంగా స్వామి వివేకానంద యొక్క జీవిత చరిత్రను తెలియజేశారు. అనంతరం డాక్టర్ త్రిశూల్ పాణి ని పాలిటెక్నిక్ కళాశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు.