Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

హైమాక్స్ లైట్లు ఏర్పాటు పనులు ప్రారంభం

విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ మేజర్ పంచాయతీలో రూ.10లక్షల నిధులతో పట్టణంలో అధునాతన హైమాక్స్ లైట్లు ఏర్పాటుకు సంబంధించిన పనులకు గురువారం ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేజర్ పంచాయతీ సుందరికరణలో భాగంగా వైస్సార్ సర్కిల్, బైపాస్, కనేకల్ క్రాస్ తదితర ప్రాంతాల్లో హై మాక్స్ లైట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అభివృద్ది పనుల్లో భాగంగా ఐదు కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయని చెప్పారు.త్రాగునీటి సమస్య పరిష్కారానికి ఉదిరిపికొండ నుంచి త్వరలో పైపులైను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.అదేవిధంగా జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి ఉచిత కుళాయిలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ద్వారా మరిన్ని నిధులు మంజూరు చేయించి మేజర్ పంచాయతీని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లలిత, ఉప సర్పంచ్ వన్నప్ప, జడ్పిటిసి సభ్యులు పార్వతమ్మ మండల వైస్ ఎంపీపీ నరసింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ సుశీలమ్మ, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఓబులేష్, కురుబ,ఎంబిసి కార్పొరేషన్ల డైరెక్టర్లు గోవిందు, జోగి వెంకటేష్,జిల్లా వక్ఫ్ బోర్డు సభ్యుడు మీరం బాషా, వార్డు సభ్యులు, ఎంపిటిసిలు,ఎస్సి సెల్ నాయకులు బసవరాజు, మాజీ ఎంపీపీ ఏసీ ఎర్రిస్వామి, పంచాయతీ ఈఓ గౌస్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img