విశాలాంధ్ర-ధర్మవరం : పట్టణములో సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంలో ఈనెల 16వ తేదీ రాత్రి వచ్చిన సమాచారం బట్టి పట్టణంలోని కేశవ నగర్, పోతిరెడ్డి గ్రౌండ్ దగ్గర, రమణ ఇంటి ముందర బహిరంగ ప్రదేశంలో మంగ పత్తా అను జూదము డబ్బును పణంగా పెట్టి ఆడుతున్న 12 మంది వ్యక్తులను తమ సిబ్బంది సహాయంతో అరెస్టు చేసి, వారి నుండి రూ.1,73,020 స్వాధీనం చేసుకొని, జూదానికి ఉపయోగించిన 14 పేక ముక్కలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందని వన్టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం మంగళవారం విలేకరులతో పేర్కొన్నారు. తదుపరి 12 మందిపై కేసును నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సిఐతో పాటు సిబ్బందిని జిల్లా ఉన్నత పోలీస్ అధికారులు అభినందనలు తెలిపారు.