Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

సీఎం కప్ హాకీ పోటీలలో ప్రతిభ చాటిన కేహెచ్ డిగ్రీ కళాశాల విద్యార్థి

విశాలాంధ్ర – ధర్మవరం : రాష్ట్రస్థాయి సీఎం కప్ హాకీ పోటీలలో ధర్మవరం పట్టణంలోని కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎం శ్రావణి ఉత్తమ ప్రతిభ కనబరిచి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి, ద్వితీయ స్థానంలో నిలిచారని కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ఆనంద్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగిన ఒకటవ తేదీ నుండి 5వ తేదీ వరకు రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలలో విజయం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మా కళాశాలలో చదువుతోపాటు క్రీడల పట్ల కూడా మంచి నైపుణ్యాన్ని ఇవ్వడం జరుగుతోందని, విద్యార్థులు కూడా అన్ని విషయాలలో ముందంజ వేయడానికి ఎంతో కృషి చేయడం గర్వించదగ్గ విషయమని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థిని అయిన శ్రావణీలు ప్రిన్సిపాల్, ఫిజికల్ డైరెక్టర్ తో పాటు వైస్ ప్రిన్సిపాల్ జీవన్ కుమార్, అధ్యాపకులు చిట్టెమ్మ, షమీఊ ల్లా, కిరణ్ కుమార్, గోపాల్ నాయక్, పావని, భువనేశ్వరి, పుష్పావతి, గౌతమి, తదితర అధ్యాపకేతర సిబ్బంది కూడా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img