ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి
విశాలాంధ్ర-రాప్తాడు : పుస్తక పఠనంతో జ్ఞానసముపార్జన సాధించడం సులువని ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి అన్నారు. సోమవారం రాప్తాడులో 55వ గ్రంథాలయ వారోత్సవాలను లైబ్రేరియన్ వీరనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఎంఈఓ మల్లికార్జున, సర్పంచ్ సాకే తిరుపాలు, వైసీపీ యూత్ కన్వీనర్ చిట్రెడ్డి సత్తిరెడ్డి, మరూరు ఆది కలిసి జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. గ్రంథాలయోద్యమ పితామహుడు అయ్యంకి వెంకట రమణమూర్తి సేవలను కొనియాడారు. గ్రంథాలయాలు సమాజ అభివృద్ధిలో అంతర్భాగమని గ్రంథాలయాలను అన్ని తరగతుల వాళ్లు ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలని కోరారు. గ్రంథాలయాలు స్వాతంత్య్ర సాధనలో భాగంగా సామాన్య ప్రజానీకానికి సమాచారాన్ని అందజేయడంలో ప్రముఖ పాత్ర వహించాయని గుర్తుచేశారు. గ్రంథాలయాలు
ప్రశాంతతతో పాటు జ్ఞానం కూడా పొందుతామన్నారు. ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా పుస్తకాలను, పత్రికలను చదివితే విజ్ఞానం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో వార్డు మెంబరు సాకే నరేంద్ర, సిబ్బంది ముత్యాలమ్మ, లక్ష్మినారాయణమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.