Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు : డీఎల్డీఓ ఓబులమ్మ

విశాలాంధ్ర -రాప్తాడు : సచివాలయ ఉద్యోగులు విధుల్లో ఆలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అనంతపురం డీఎల్డీఓ ఓబులమ్మ హెచ్చరించారు. మండలంలోని హంపాపురం, మరూరు, గొల్లపల్లి గ్రామ సచివాలయాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కార్యాలయ రికార్డులను పరిశీలించారు. ప్రతి రోజూ బయోమెట్రిక్ అటెండెన్స్ నిర్దేశించిన సమయంలో వేయడంతోపాటు విధులకు యూనిఫాం వేసుకుని రావాలన్నారు. తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. ప్రభుత్వ పథకాలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ పథకాలను అందజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఈఓఆర్డీ ఎస్. మాధవి, పంచాయతీ కార్యదర్శులు వరలక్ష్మి, చరణ్, నవీన్, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img