Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సేవా కార్యక్రమాలను అలవర్చుకోండి

శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్లు
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలను అలవర్చుకోవాలని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 300 మంది రోగులకు వారి సహాయకులకు ఆసుపత్రి వైద్యుల చేతులు మీదుగా భోజనపు ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ పద్మలత మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవా సమితి చేస్తున్న సేవలు అనన్యమైనవని, రోగులకు ఆకలిని తీర్చడం దైవ సహాయముతో సమానమని తెలిపారు.ఈ కార్యక్రమంలో సేవాదళ్ సభ్యులు పురుషులు 13 మంది మహిళలు నలుగురు పాల్గొన్నారు. అనంతరం శ్రీ సత్య సాయి భజన మండలి వారు పాండురంగ స్వామి దేవాలయంలో శుక్రవారం నాడు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి దాదాపు 100 మందికి పైగా రోగులు హాజరై వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అనంతరం కీర్తిశేషులు బుక్కపట్నం సదాశివ వారి జ్ఞాపకార్థం500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భజన మండలి బృందం వారు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img