Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల కేంద్రాలలో అన్ని సదుపాయాలు పక్కాగా ఉండాలి

జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్
విశాలాంధ్ర – ధర్మవరం : ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 13వ తేదీన నిర్వహించాల్సి ఉండగా, వాటికి సంబంధించిన ఎన్నికల కేంద్రాలను శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఎన్నికల కేంద్రాలైన జడ్పీ గర్ల్స్ హై స్కూల్, గర్ల్స్ జూనియర్ కాలేజ్, నెహ్రు నగర్ మున్సిపల్ హై స్కూల్ కేంద్రాలను వారు పరిశీలిస్తూ, అక్కడ ఉన్నటువంటి సదుపాయాలను అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎన్నికల కేంద్రాల నియమావళి ప్రకారం అన్ని సదుపాయాలు ఉండేటట్లుగా సంబంధిత అధికారులు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటూ ఎన్నికలు విజయవంతం అయ్యేలా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి ఎన్నికల కేంద్రంలోనూ ఫర్నిచర్ తో పాటు బాత్రూములు, తాగునీటి వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ తదితర సదుపాయాలను ముందస్తు రోజునే పూర్తి చేయాలని అధికారులను వారు ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవలసిన బాధ్యత ఆయా సంబంధిత అధికారులు దేనని వారు సూచించారు. అనంతరం రామగిరి మండలానికి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో తిప్పే నాయక్, తహసిల్దార్ యోగేశ్వరి దేవి, సెక్టారియల్ అధికారి చెన్న వీరస్వామి, ఎలక్షన్ డ్యూటీ అనిల్ కుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img