ఇంచార్జ్ తహసిల్దార్ ఈశ్వరయ్య
విశాలాంధ్ర ధర్మవరం:: అంబేద్కర్ సిద్ధాంతాలు ప్రపంచ తాత్వికులకు, సమతూల్యమైనవని, తులనాత్మకమైనవని ఇన్చార్జ్ తాసిల్దార్ ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం తహసిల్దార్ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సిబ్బందితో కలిసి తాసిల్దార్ ఈశ్వరయ్య చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సామాజిక బందీల విముక్తి ప్రదాత అంబేద్కర్ అని తెలిపారు. అంబేద్కర్ తన ఉపన్యాసాలు, రచనల ద్వారా పీడిత, తాడిత జనుల ఉద్ధరణకు కృషిచేసిన మహనీయుడని తెలిపారు. అంబేద్కర్ తన ప్రతిభాసంపత్తితో అస్పుష్యల గురించి, అనేక కమిషన్లకు వివరాలు అందించి అనేక హక్కులు సాధించారని తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధనాలకు, అన్ని వర్గాల వారు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది నజీర్ అహ్మద్, భాస్కర్, గిరిధర్ రెడ్డి, విష్ణువర్ధన్, మురళి, వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.