ఏడీఏ మహమ్మద్ ఖాద్రి
విశాలాంధ్ర : నందవరం సేంద్రీయ వ్యవసాయంతో రసాయన ఎరువులకు స్వస్తి చెప్పవచ్చని ఏడీఏ మహమ్మద్ ఖాద్రి అన్నారు. గురువారం నందవరం మండల పరిధిలోని నదికైరవాడి గ్రామంలో ఏఓ స్రవంతి ఆధ్వర్యంలో రైతులకు క్లస్టర్ స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు లాభసాటిగా ఉండాలనే లక్ష్యంతో ప్రకృతి సేద్యానికి రాష్ట్ర ప్రభుత్వం సైతం తోడ్పాటును అందిస్తోందని పెట్టుబడులు తగ్గడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని వారు తెలిపారు.రైతుల తో బృంద విన్యాసం చేయించడం పలు రకాల పంటలలో సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని రైతులకు అవగాహన కల్పించడం జరిగిందని, సేంద్రియ వ్యవసాయం చేసే రైతుల తో ముఖముఖీ చర్చించి రైతులను సొంత నిర్ణయాధికారిగా ఏర్పాటు చేసుకొనుట తగు సూచనలు ఇవ్వటం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిక్షణ కేంద్రం నుంచి వ్యవసాయ అధికారులు మాధురి, హేమలత,కేవికే శాస్ర్తవేత్త లక్ష్మణ్ కుమార్, ఏపీ సీడ్స్ ధృవీకరణ అధికారి సునీల్ కుమార్ రెడ్డి,విస్తరణ అధికారి సురేంద్ర గౌడ్,గ్రామ వ్యవసాయ సహాయకుడు విజయ్ ,గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.