విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఆంధ్రప్రదేశ్ అల్లోపతి మెడికల్ కౌన్సిల్ మరియు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత కమిటీ చట్టం క్రింద ఉన్న పట్టణ ప్రైవేట్ ఆసుపత్రులు అలాగే ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తున్న ఆసుపత్రుల వారికి గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ భవనంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం నకు అధ్యక్షత వహించిన అధికారులు మాట్లాడుతూ.. ఆసుపత్రుల యాజమాన్యం వారికి వివరాలు పొందుపరచడంలో తగు సూచనలు చేస్తూ, ప్రైవేట్ ఆస్పత్రుల వారు అందిస్తున్న సేవలను ప్రతి రోజూ జిల్లా కార్యాలయానికి త్వరితగతిన వివరాలను తెలపాలన్నారు. అలాగే గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం లో భాగంగా ఆసుపత్రుల వారు పొందుపరిచే ఫారం -ఎఫ్ ను సవివరంగా జిల్లా కార్యాలయానికి పంపాలని పేర్కొన్నారు. అదే విధంగా ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ అప్లికేషన్ గురించి ఐ ఆర్ ఏ డి ప్రాజెక్ట్ మేనేజర్ సొమ్లా నాయక్ మరియు జిల్లా రవాణా వైద్యాధికారి డా. సురేష్ లు మాట్లాడుతూ…రోడ్డు ప్రమాద బాధితులు చికిత్స నిమిత్తం ఆసుపత్రి నందు చేరినప్పుడు వారి వివరాలను ఎప్పటకప్పుడు ఐ ఆర్ ఏ డి అప్లికేషన్ లో ఖచ్చితంగా నమోదు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డెమో భారతీ,డిప్యూటి డెమో త్యాగరాజు, మారుతి ప్రసాద్, గిరిధర్ రెడ్డి, వేణు,శ్రీకాంత్,కిరణ్, పాల్గొన్నారు.