Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అగ్నిమాపక ప్రమాదాలపై అవగాహన

విశాలాంధ్ర-తాడిపత్రి : పట్టణంలోని ములాంపుల్ సర్కిల్, యల్లనూరు రోడ్డు, బస్టాండ్ సమీపంలో శనివారం అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అగ్నిమాపక అధికారి మోహన్ బాబు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక ప్రమాదాలపై ఆటో వాళ్లకు, చిరు వ్యాపారస్తులకు, వాహనాలపై వెళ్లే వాహనదారులకు అగ్నిమాపక అధికారి మోహన్ బాబు చేతుల మీదుగా కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోటళ్లల్లో వంట గ్యాస్ ఉన్నచోట అగ్గిపెట్టలు, ఒకే చోట రెండు సిలిండర్లు ఉంచుకోరాదన్నారు. అగ్ని ప్రమాదాల సంభవించినప్పుడు వెంటనే అగ్ని మాపక శాఖ సమాచారం అందజేయాలన్నారు. అనంతరం అగ్ని ప్రమాదాలు సంభవించిన ప్పుడు ప్రమాదాల్లో ఎదుర్కొనే విన్యాసాలను అగ్నిమాపక సిబ్బంది ప్రజలను అబ్బురపరిచే విధంగా నీళ్లతో విన్యాసాలు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. అగ్నిమాపక సిబ్బంది రామయ్య, రామాంజనేయులు, నవీన్, షకీల్ శ్రీనివాసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img