Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

తల్లిపాలు వారోత్సవాలపై అవగాహన ర్యాలీ

విశాలాంధ్ర బొమ్మనహళ్ : మండలంలోని ఉద్దేహళ్ రంగాపురం క్యాంప్ గ్రామం లో వైద్య అధికారులు శ్రీ లక్ష్మీ మల్లేశ్వరి ఆధ్వర్యంలో బుధవారం వైద్య సిబ్బంది తల్లిపాలు వారోత్సవాలు సందర్భంగా ఆయా గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి తల్లిపాలు ప్రాముఖ్యత పై గర్భవతులు బాలింతలు ,ప్రజలకు అవగాహన కల్పించారు. బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు త్రాగిం చాలని , ఆపాలే మొదటి వాక్సిన్ లాగా బిడ్డ వ్యాధినిరోధక శక్తిని పెంచు తాయని, తియ్యటి పానీయాలు ,పోతపాలు త్రా గించరాధని ,అవి బిడ్డకు నిమోనియా ,డయేరియా వ్యాధులను కలగచేస్తా యని ,బిడ్డ పుట్టినప్పటి నుండి ఆరు నెలల వరకు తల్లి పాలు త్రాగించి ,ఆతర్వాత అదనపు ఆహారం ఇవ్వవచ్చని ,నిర్ణీత కాలమాన ప్రకారం బిడ్డలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి ప్రజలకు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు గోవర్ధన్ వెంకట రమణ , ఏ యన్ ఎం . ఎర్ర మ్మ ,ఆశలు చిట్టెమ్మ, గంగమ్మ, అంగన్వాడీ కార్యకర్త మీన పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img