Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఘనంగా జరిగిన అయ్యప్ప స్వామి జయంతి వేడుకలు

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని చెరువు కట్ట వద్ద గల శ్రీ అయ్యప్ప స్వామి భజన మండలి దేవాలయంలో బుధవారం ఓనం గురుస్వామి అంబటి సతీష్, గురుస్వామి విజయ్ కుమార్ వారి ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప స్వామి జయంతి వేడుకలను వందలాదిమంది శిష్య బృందం నడుమ జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం అంబటి సతీష్ అయ్యప్ప స్వామి చిత్రపటాలకు వివిధ పూలమాలలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సాయంత్రం గురుస్వామి విజయ్ కుమార్ శిష్య బృందం వారి ఆధ్వర్యంలో అలంకరణతో పాటు భజన కార్యక్రమాలు భక్తాదులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం అంబటి సతీష్ విజయ కుమారులు మాట్లాడుతూ నేడు ప్రపంచవ్యాప్తంగా అయ్యప్ప స్వామి యొక్క మహిమలు అమోఘమని, స్వామిని నమ్మినవారికి అంతా శుభమే కలుగుతుందని వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ మానవసేవను అలవర్చుకోవాలని, దైవాశీస్సులు లేనిదే మానవుని యొక్క పనులు ఏమాత్రం కూడా విజయవంతం కావని తెలిపారు. అయ్యప్ప దీక్షలు నిష్టతో చేయాలని, అప్పుడే కుటుంబం యొక్క సమస్యలు కూడా అన్ని పరిష్కరించబడతాయని తెలిపారు. తదుపరి అయ్యప్ప స్వామి యొక్క జీవిత చరిత్రను శిష్య బృందానికి చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో వందలాదిమంది అయ్యప్ప భక్తులు, శిష్య బృందం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img