Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సమానత్వమే బాబూజీ కలలు కన్న స్వరాజ్యం

మెడికల్ కళాశాలలో జాతీయ సమత దినం
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం
: మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరేపల్లి శ్రీదేవి ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భముగా జాతీయ సమత దినం ను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ బడుగు బలహీనర్గాలకు ఆశాజ్యోతి గా,వారి అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించి, అంటరానితనాన్ని నిర్మూలించడానికి,అస్పృశ్యత లను పోగొట్టడానికి,సమాజం లో అందరూ సమానత్వం తో బ్రతకడానికి బాబూజీ పోరాడారని దాని ఫలితమే ప్రస్తుత సమాజం లో అందరూ అన్ని సమానం గా సాధించ గలుగుతున్నారు అని తెలిపారు. ప్రిన్సిపాల్ శ్రీదేవి బాబూజీ కి పూలమాల వేసి పుష్పాలతో శ్రద్ధాంజలి తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆచార్య డాక్టర్ శంకర్,సహాచార్యులు డాక్టర్ శైలజ,డాక్టర్ శారద,డాక్టర్ రవితేజ,డాక్టర్ భాస్కర్ బాబు,ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు,ఆఫీస్ సూపరింటెండెంట్ రవికుమార్,సహాయకులు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img