Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

భారత అమూల్యరత్నం బాబు జగ్జీవన్ రామ్

విశాలాంధ్ర – బుక్కరాయసముద్రం : భారత అమూల్యరత్నం బాబు జగ్జీవన్ రామ్ అని రెక్టర్ ఆచార విజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెక్టర్,రిజిస్ట్రార్ ఆచార్య సి. శశిధర్ మాట్లాడుతూ. ప్రజానాయకుడని దేశాబి వృద్ది లో ఆయన కీలక పాత్ర పోషించారని, అత్యంత చిన్న వయస్సులో మొదటి కేబినేట్ లో మంత్రి పదవి సాధించిన ఏకైక వ్యక్తీ అని మరియు కేంద్రమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా నిండుదనంతో బలమైన సుగుణశీలి వ్యక్తిత్వం, ఆయన ఆశయాలను ప్రతి ఒక్క విద్యార్థి అలవర్చుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, ఆచార్య ఇ. కేశవ రెడ్డి ఆచార్య బి. ఈశ్వర్ రెడ్డి , ఆచార్య సి. శోభా బిందు , ఆచార్య సుబ్బారెడ్డి , ఆచార్య పద్మ సువర్ణ గారు, , ఆచార్య చంద్ర మోహన్ రెడ్డి , ఆచార్య సురేష్ బాబు , ఆచార్య కె.బి. చంద్ర శేఖర్ , స్పోర్ట్స్ కౌన్సిల్ శ్రీ జోజిరెడ్డి , పి ఆర్ ఓ డాక్టర్ యం. రామశేఖర రెడ్డి , వైస్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. భవాని , భోధన, భోధనేతర సిబ్బంది మరియు అవుట్ సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img