Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జాతీయ జూడో పోటీలలో కాంస్య పథకం

విశాలాంధ్ర – ధర్మవరం:: ఇటీవల చెన్నైలో జరిగిన సబ్ జూనియర్ అండ్ క్రెడిట్ జాతీయస్థాయి జూడో ఛాంపియన్షిప్ లో మండల పరిధిలోని చిగిచెర్ల గ్రామం లోని జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న క్రీడాకారిణి కె. యశ్వితా సబ్ జూనియర్-28 కేజీల విభాగంలో కాంక్ష పథకంలో సాధించడం జరిగిందని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయసాయి, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రతాపరెడ్డి తెలిపారు. అనంతరం హెచ్ఎం మాట్లాడుతూ మా పాఠశాలలో చదువుతోపాటు క్రీడల పట్ల కూడా సమానమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పలు క్రీడల పట్ల మా పాఠశాలకు మంచి గుర్తింపు రావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం తో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు అభినందించి, హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img