Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

వృత్తిని దైవంగా భావించాలి

మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగజ్యోతి

విశాలాంధ్ర – ధర్మవరం : ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి తాను చేసే వృత్తిని దైవంగా భావించినప్పుడే, ప్రజలకు న్యాయం చేకూరుతుందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగజ్యోతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలోని ఎన్జీవో ఎన్జీవో హోం లో అభినందన సభను ఏర్పాటు చేశారు. స్థానికంగా డాక్టర్ నాగజ్యోతి ప్రజలు, అధికారులు, సిబ్బంది వద్ద మంచి గుర్తింపు, మన్ననలు పొందడం జరిగింది. ఇందులో భాగంగానే డాక్టర్ నాగజ్యోతి ధర్మవరం లో పిపీ యూనిట్ మెడికల్ ఆఫీసర్గా నుండి పదోన్నతి పై నంద్యాలకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నాగజ్యోతి చేసిన సేవలను అధికారులు, అర్బన్ మెడికల్ అండ్ హెల్త్ సెంటర్ ,సిబ్బంది కొనియాడారు. అనంతరం డాక్టర్ నాగజ్యోతి తో పాటు భర్త భాస్కర్లను వైద్యాధికారులు వైద్య సిబ్బందితో కలిపి అందరూ ఘనంగా సన్మానం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img