Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

గ్రంథాలయాన్ని పరిశీలించిన చైర్మన్ ఉమాదేవి

విశాలాంధ్ర : శెట్టూరు గ్రంథాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎల్ యం ఉమాదేవి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో గ్రంథాలయాలకు మహర్దశ వచ్చిందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఉమాదేవి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని గ్రంథాలయంలో చైర్మన్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా హాజరు రికార్డులు, విజిటర్ రికార్డులను పరిశీలించారు. గ్రంథాలయనికి ఇంకా ఏదైనా అవసరం ఉన్నాయా. స్థానికంగా సమస్యలు ఉన్నాయా అని ప్రజలను అడుగగా లైబ్రరీకి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని కోరారు. గ్రంథాలయాన్ని అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పాఠకులకు అందుబాటులో ఉండే విధంగా నవలు, దినపత్రికలు విద్యార్థులు పోటీ పరీక్షలో మరింత ఆకర్షణీయంగా చేయాలని స్థానిక గ్రంథాలయ అధికారిణి రజిని కి చైర్మన్ సూచించారు. ప్రతి గ్రామాల్లో సహితం ప్రపంచ విజ్ఞానం అందిపుచుకొనే విధంగా డిజిటల్ లైబ్రరీలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్, ఎల్ ఎం మోహన్ రెడ్డి, గ్రంథాలయ అధికారి రజిని పాఠకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img