Friday, April 19, 2024
Friday, April 19, 2024

నిరాధారణకు గురి అయినటువంటి హెచ్చెల్సీ – పయ్యావుల కేశవ్!

విశాలాంధ్ర బొమ్మనహల్: అనంతపురం జిల్లాకు జీవనాడి అయిన తుంగభద్ర ఎదవ కాలువ నిరాదరణకు గురైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు మంగళవారం కణేకల్ చెరువు ను ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, కాలవ శ్రీనివాసులు పరిశీలించారు అనంతరం మీడియాతో కేశవ్ మాట్లాడుతూ .. ఈ ప్రభుత్వం హెచ్చెల్సీ కాలువను పూర్తిగా నిర్వీర్యం చేసిందని లక్షల మంది రైతులు దీని మీద ఆధారపడి ఉన్నారన్నారు. ఆఖరికి గేట్లు కూడ పైకి క్రిందకు ఎత్తలేని పరిస్థితి ఉందని అన్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై తెలుగుదేశం పార్టీ పోరుణ ప్రకటించింది.. ప్రాజెక్టుల పేరుతో పాదయాత్ర కూడ చేయబోతున్నాం. హెచ్చెల్సీ కాలువలో మోడలైజేషన్ పేరుతో మిగిలిన 10% పనులు కూడ ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు.. అలాగే హాంద్రీనీవాలో మిగిలిన వైడినింగ్ పనులు కూడ పూర్తి చేయాలని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం అని ఎమ్మెల్యే *పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img