Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఇంట్లో విద్యుత్తుకు ఆర్థిక సహాయం అందించిన చిలకం మధుసూదన్ రెడ్డి

విశాలాంధ్ర – ధర్మవరం:: పట్టణంలో సోమవారం సేవ్ ధర్మవరం కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటా ప్రజలను కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిపిఐ కొట్టాలకు చెందిన రంగం రామాంజనమ్మ రంగం రాము ఇంట్లో కరెంటు సప్లై లేదని అధికారులకు ఫిర్యాదు చేస్తే మీ ఖర్చుతో విద్యుత్ ఫోలు వేయించుకోమని తెలిపారని, మాకు ఆ స్తోమత లేదని బాధితులు తెలపడంతో, వెనివెంటనే చిలకం మధుసూదన్ రెడ్డి స్పందించి తన సొంత నిధులతో పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులు చిలకం మధుసూదన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img