Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

ముత్తుకూరు లో ఇరువర్గాల ఘర్షణ

13 మందిపై కేసు నమోదు

విశాలాంధ్ర – ఆస్పరి : మండల పరిధిలోనే ముత్తుకూరు గ్రామంలో గురువారం రాత్రి జరిగిన పొలం రాస్తా ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన 13 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వరప్రసాద్ తెలిపారు. శనివారం ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. గరక ఈరన్న, గరక హనుమంతు ఇద్దరు కూడా దాయాదులన్నారు. ఇరువురి పొలాలు ప్రక్కపక్కనే ఉన్నాయని, అయితే పొలం రస్తా విషయంలో రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులు మధ్య ఘర్షణ జరగడంతో అందరికీ కూడా రక్తపు గాయాలు అయ్యాయన్నారు. ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. గరక ఈరన్న వర్గంలో ఏడు మందిపై, గరక హనుమంతు వర్గంలో ఆరు మందుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img