Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ

విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ మండలం షేక్షాన్ పల్లి గ్రామానికి చెందిన మాదిగ రేణుకమ్మ కు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కును గురువారం ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి తన స్వగ్రామం కొనకొండ్ల లో బాధితులకు అందజేశారు. అనారోగ్య బారిన పడి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడంతో వారు ఖర్చు చేసిన మొత్తము కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి బాధితులకు 1,16,000/- రూపాయలు మంజూరు కావడం జరిగిందని ఎమ్మెల్సీ తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి తమకు సీఎం సహాయ నిధి మంజూర చేయించారని వారు తెలిపారు. ఎమ్మెల్సీకి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img