Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపాలి

సిపిఐ, సిపిఎం

విశాలాంధ్ర- ఉరవకొండ : ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపాలని సిపిఐ, సిపిఎం నాయకులు పేర్కొన్నారు.ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ, సిపిఎం నాయకులు ప్రచార భేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం వజ్రకరూరు మండల కేంద్రంలో రెండు పార్టీల నాయకులు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని గద్దె దింపడమే వామపక్షాల లక్ష్యమన్నారు. మోడీని గద్దె దింపండి…దేశాన్ని కాపాడండి అనే నినాదంతో ప్రచార జాత కార్యక్రమాన్ని ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ సంస్థల ప్రవేటీకరణను తక్షణమే విరమించుకోవాలని,డీజిల్,పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గించి నిత్యావసర సరుకులు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ ఉరవకొండ నియోజకవర్గం కార్యదర్శి జె. మల్లికార్జున, వజ్రకరూరు కార్యదర్శి సుల్తాన్ సహాయ కార్యదర్శి బోయ హనుమంతు, మహిళా సమైక్య నాయకురాలు వన్నూరమ్మ, రైతు సంఘం నాయకులు నాగరాజు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వీరుపాక్షి తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img